/rtv/media/media_files/2024/12/05/HarHmVYjQmTZomM8ukdJ.jpg)
Padi koushik reddy arrest
TG Crime : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి బిగ్ షాక్ తగిలింది. కాజీపేటలోని రైల్వే కోర్టు కౌశిక్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. క్వారీ యజమాని మనోజ్ను బెదిరించిన కేసులో రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కౌశిక్ రెడ్డిని ఖమ్మం జిల్లా జైలుకు తరలించబోతున్నారు. కాగా హుజురాబాద్ నియోజకవర్గంలోని వంగపల్లికి లో క్రషర్ నిర్వహిస్తున్న మనోజ్ రెడ్డిని బెదిరించి రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసిన వరంగల్ జిల్లా సుబేదారి పోలీసులు ఈ రోజు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్ విధించారు. కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పటిష్ట భద్రత నడుమ కౌశిక్ రెడ్డిని ఖమ్మం తరలించనున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పీఎస్ దగ్గర హైడ్రామా కొనసాగుతోంది.
కక్ష సాధింపు కేసు...బీఆర్ఎస్ వాదన
కాగా కౌశిక్ రెడ్డి అరెస్ట్ తర్వాత హన్మకొండలో ఉద్రిక్తత నెలకొంది. ఆయన అరెస్ట్ను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాగా కోర్టులో పాడి కౌశిక్రెడ్డి క్వారీ యజమానిని భయభ్రాంతులకు గురి చేశారని.. అతడికి రిమాండ్ విధించాలంటూ పీపీ వాదించారు.క్వారీ యజమాని మనోజ్ రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు. అయితే దీన్ని బీఆర్ఎస్ ఖండించింది. ఇది కక్ష సాధింపు కేసు గానే పరిగణించాలంటూ బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. మొదట ఎఫ్ఐఆర్లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ లాయర్ వాదించారు. 308 సెక్షన్ 4ని తర్వాత మార్చి ఫైవ్ చేయడంతో నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారని లీగల్ టీం కోర్టుకు అభిప్రాయపడింది. కక్ష సాధింపు కేసు అయినందున పాడి కౌశిక్ రెడ్డికి రిమాండ్ విధించవద్దని.. లీగల్ టీం వాధించింది. ఇరు వాదనలు విన్న కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఇది కమీషన్ సర్కార్...కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాగా కోర్టులో హాజరుపరచే ముందు..కౌశిక్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించారు. ఆస్పత్రిలోకి వెళ్లే ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు.. ఈ కాంగ్రెస్ సర్కార్ 20% కమీషన్ సర్కార్.. పోలీస్ ఆఫీసర్ల దగ్గర కమీషన్స్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యే నాగరాజు.. అక్రమ మైనింగ్ చేస్తున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోకపోవడం హాస్యస్పదం..” అని వ్యాఖ్యానించారు. అంతలోపే పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు.