/rtv/media/media_files/2025/05/31/5OTZyUmB7AD43vInF8LZ.jpg)
maoists surrender
Maoists surrender : రాష్ట్రంలోకి మావోల ఎంట్రీ లేకుండా పటిష్ట నిఘా ఎఏర్పాటు చేశామని, ఆపరేషన్ కర్రిగుట్టల నేపథ్యంలో సరిసద్దులో మరింత అప్రమత్తంగా వ్యవహరించామని భధ్రాధ్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు. కొత్తగూడెంలో 17 మంది మావోయిస్టు సభ్యులు జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారుల సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడారు.
Also Read : Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్తో రొమాన్స్కి బోల్డ్ బ్యూటీ
Also Read : BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్లోనే
సీపీఐ మావోయిస్టు పార్టీ నార్త్ తెలంగాణ జోనల్ కమిటీలో మిగిలిన 85 మంది అండర్ గ్రౌండ్ లో తలదాచుకున్నారన్నారు. మావోలను ఒకటే కోరుతున్నామని,షరతులు లేకుండా వనంవీడి జనంలోకి రండని పిలుపునిచ్చారు.హింసాయుత ధోరణిని ఎవరూ స్వాగతించరన్న ఆయన లొంగిపోయిన నక్సల్స్కు ఆపరేషన్ చేయూత పేరిట సరెండర్ పాలసీని పకడ్బంధీగా పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో లవ్స్టోరీ.. ప్రేమ విఫలమైందని బాలిక ఆత్మహత్యాయత్నం
కాగా లొంగిపోయిన వారిలో ఏసీఎం క్యాడర్కు చెందిన ఇద్దరు, పార్టీ సభ్యులు నలుగురు, మిలీషియా సభ్యులు 11 మంది ఉన్నట్లు వివరించారు. ఏజెన్సీ ప్రాంత వాసుల్లో మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం సన్నగిల్లిందన్నారు. తెలంగాణలో మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చే పరిస్థితులు లేవని చెప్పారు. విశ్వసనీయ సమాచారంతో ఇటీవల జిల్లాలో 20 మంది సాయుధ దళ సభ్యులను అరెస్టు చేశామన్నారు. వారినుంచి 12 ఆయుధాలను జప్తు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 282 మంది మావోయిస్టు దళ సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసి తగిన పునరావాస సౌకర్యాలను పొందినట్లు ఎస్పీ వివరించారు. మిగిలిన వారు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.
Also Read : రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు
Also Read : నువ్వు కాదు ఆ మాట మీ అయ్యతో చెప్పించు.. కవితపై రఘునందన్ సంచలనం!