/rtv/media/media_files/2025/06/28/tg-crime-2025-06-28-10-15-48.jpg)
TG Crime
మానవీయ సంబంధాలు రోజు రోజుకు మంటగలుస్తున్నాయి. మానవత్వాన్ని మరచి మరి తోటివారిని హింసింస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. వరంగల్ జిల్లాలో అలాంటి దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం నేపథ్యంలో ఒక మహిళను వివస్త్రను చేసి అత్యంత క్రూరంగా దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయంశంగా మారింది. తాటికాయల గ్రామానికి చెందిన ఓ మహిళకు పదేళ్ల క్రితం ములుగు మండలానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇదే క్రమంలో భర్తకు ఒక సన్నిహిత బంధువైన వివాహితతో అక్రమ సంబంధం ఏర్పడినట్లు తెలిసింది.
Also Read: వందేభారత్ రైలులో దారుణం..సీటు మారలేదని ప్రయాణికుడిని చితకబాదిన ఎమ్మెల్యే
Illegal Affair Case
ఇదిలా ఉండగా పదిరోజుల క్రితం అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో అతను ఏటో వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసిన అతడి మొదటి భార్య కోపంతో ఊగిపోయింది, విషయాన్ని ఆమె తల్లిదండ్రులు, బంధువులుకు చెప్పింది. అంతే వారంతా కోపంతో రగిలిపోయారు. లేచిపోయిన జంటకోసం వెతికి ఇద్దరిని పట్టుకుని తాటికాయల గ్రామానికి తీసుకువచ్చారు. వారిద్ధరికీ గుండు చేయించారు.
Also Read: కోల్కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు
అక్కడ ఆ వివాహితను కట్టేసి, ఆమెను వివస్త్రను చేశారు. అంతటితో ఆగకుండా, ఆమె ప్రైవేట్ పార్ట్లో జీడి పోసి మానవత్వం మరిచిపోయేలా దాడి చేశారు. జననాంగంలోనుంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. బాధితురాలు ‘క్షమించండి’ అని కన్నీళ్లతో వేడుకుంటున్నా వారు వినలేదు. స్థానికులు అడ్డు చెబితే వారిని కూడా బెదిరించారు. కాగా ఆలస్యంగా విషయం బయటకు రావడంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: షాకింగ్ వీడియో.. తన మూత్రంతో కళ్ళు కడుకున్న మహిళ - దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
Also Read : రైల్వే ట్రాక్పై కారు నడిపిన యువతి.. ఆమె మానస్థితిపై అనుమానంతో..
warangal-crime-news | Warangal Crime Today | warangal crime | crime news | warangal