Car on a Railway Track : రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. ఆమె మానస్థితిపై అనుమానంతో...

రైళ్లు వెళ్లాల్సిన పటాలపై ఓ యువతి వినూత్న రీతిలో పట్టాలపై నుంచి కారు నడుపుతూ హల్చల్ చేసింది. ఈ సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం రేపింది. సుమారు 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన ఆమెను ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తరలించారు.

New Update
A young woman drove a car on a railway track.

A young woman drove a car on a railway track.

Car on a Railway Track : రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ వద్ద పట్టాలపై కారు ప్రత్యక్షమైంది. కొండకల్ నుంచి చిన్న శంకర్‌పల్లి వరకు సుమారు 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్‌పై ఆ కారు ప్రయాణించింది. రైలు పట్టాలపై కారు ప్రత్యక్షమవ్వడంతో అందరూ అవాక్కయ్యారు. ఆ తర్వాత తేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన పోలీసులు ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కారు నడిపిన యువతిని వోమిక సోనీగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, వారిపై దాడి చేసింది. సోని చేసిన పనికి రైల్వే వ్యవస్థ గంట 20 నిమిషాల పాటు స్తంభించింది.  8 ప్యాసింజర్‌, గూడ్స్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. ఆమెపై రైల్వే సెక్షన్లు 147 ట్రేస్ పాస్, 153 రైళ్ల రాకపోకలకు అంతరాయం కింద కేసులు నమోదు చేశారు. 

Also Read: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!

 దీంతో అధికారులు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చేవెళ్లలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమె మానసికంగా సరిగ్గా లేనట్లు తేలటంతో హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి తరలించారు.  చికిత్స తర్వాత విచారణకు హాజరుకావాలని పోలీసులు తెలిపారు. కాగా, వోమిక సోనీ గత కొన్నిరోజులగా తల్లిదండ్రులు, భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పొగొట్టుకున్న సోని డ్రిపెషన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లక్నోకి చెందిన సోనీ స్థానికంగా పుప్పాల గూడలో నివాసం ఉంటుంది.

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందిన  ఓమికా సోని (34) నగరంలోని పుప్పాలగూడలో గల హిల్ క్రిస్ట్ అపార్ట్‌ మెంట్లో 2019 సంవత్సరం నుంచి ఉంటుంది. ఆమె క్యాప్ జెమినీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా పని చేస్తూ సుమారు నెలకు రూ. 1.50 లక్షలు సంపాదిస్తుంది. అయితే ఆమెకు 2022 లో భర్తతో విడాకులు కాగా అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తుంది. ఇదిలా ఉండగానే మూడు నెలల క్రితం ఉద్యోగం కూడా పోయింది. ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి.  రెండు నెలల నుంచి తమతో సైతం ఫోన్లో కూడా మాట్లాడం లేదని పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుందని తల్లిదండ్రలు తెలిపారు. అయితే ఆమె గురువారం తెల్లవారుజామున తన కియా సోనేట్ (టీ ఎస్ 07కే బీ 1604) నెంబర్ గల కారులో ఉదయం 6:50 కు రింగ్ రోడ్డు పైనుంచి నాగులపల్లి మీదుగా శంకరపల్లి మండలం కొండకల్ గ్రామానికి  వచ్చింది. కొండకల్ రైల్వే గేటు వద్ద  ఆమె కారును రైలు పట్టాలు ఎక్కించి శంకర్‌ పల్లి రైల్వే స్టేషన్ సమీపం వరకు వచ్చింది. అప్పటికే సమాచారం అందుకున్న రైల్వే అధికారులు పట్టాలను క్రాసింగ్ చేశారు. దీంతో  కారు ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. ఈ క్రమంలో ఆమె తన వద్ద ఉన్న నాన్ చాక్ చూపుతూ బెదిరించింది. ఆమె స్వతహాగా మారథాన్ రన్నర్ కావడం బలిష్టంగా ఉండటంతో అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ఇబ్బంది పడ్డారు. ఎలాగోలా ఆమెను పోలీసులు, రైల్వే అధికారులు ఆమె చేతులకు టవల్‌ తో కట్టి శంకరపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమెను విచారిస్తే ఏ మాత్రం స్పందించలేదు. తండ్రి ఫోన్ నెంబర్లు మాత్రం పోలీసులకు తెలపడంతో పోలీసులు ఆయనతో మాట్లాడి వివరాలు సేకరించారు.  

Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్‌ మస్క్‌ కీలక సూచన

అదుపులోకి తీసుకున్న యువతి చికిత్స నిమిత్తం చేవెళ్ల ఆసుపత్రికి తరలించగా ఆమె వైద్యం చేయడానికి సహకరించకపోవడంతో పోలీసులు ఆమెను ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై నాంపల్లి రైల్వే సీఐ శ్రీనివాసులు వివరణ కోరగా ఓమికా సోని ఆత్మహత్య చేసుకోవడానికి కాలుతో రైల్వే ట్రాక్ పైకి వెళ్లిందని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసులను దుర్భాషలాడినందున భూమికాసోనిపై శంకర్పల్లి పోలీసులు మరో కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు