TG Crime : జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఈ రోజు జరిగిన ఒక దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

New Update
Two dead, seven injured due to electrocution

Two dead, seven injured due to electrocution

TG Crime : జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఈ రోజు జరిగిన ఒక దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కోరుట్ల పట్టణంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. 

Also Read: దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య

స్థానిక బాలాజీ వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో  క్రేన్ ద్వారా విగ్రహాలు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రేన్ చివరి భాగం ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న హైటెన్షన్ వైర్లను తాకాయి. దీంతో మొత్తం తొమ్మిది మందికి కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరు చనిపోగా మరో ఇద్దరి పరిస్థతి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వినాయక విగ్రహాలను క్రేన్‌ సాయంతో మరో ప్రాంతానికి తరలిస్తున్న క్రమంలో స్ట్రీట్‌లైన్‌ విద్యుత్‌ తీగలు తగిలి ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం.ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: 'స్క్విడ్ గేమ్ 3' చివరి ట్రైలర్.. ఉత్కంఠగా మారిన గేమ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు