/rtv/media/media_files/2025/06/28/maha-news-2025-06-28-15-48-05.jpg)
Maha news
BREAKING: హైదరాబాద్(Hyderabad)లో మహా న్యూస్(Maha News) ఛానెల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్(BRS) దాడి చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. మీడియా సంస్థపై ఇలా భౌతికంగా దాడి చేయడాన్ని పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇది అత్యంత గర్హనీయమైన చర్య అని అన్నారు. మీడియా సంస్థలు ప్రసారం చేసే వార్తలు లేదా కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటికి కొన్ని పద్ధతులు ఉంటాయని తెలిపారు. డైరెక్ట్గా కార్యాలయాలపై దాడులకు దిగడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం అన్నారు.
ఇది కూడా చూడండి: Sexual Harassment : ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు
మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై దాడి గర్హనీయం
— JanaSena Party (@JanaSenaParty) June 28, 2025
హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి గర్హనీయం. మీడియాలో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధానం ఒకటి ఉంటుంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదు.…
ఇది కూడా చూడండి: Shefali Jariwala: గుండె పోటు కాదు.. షఫాలీ పోస్ట్మార్టంలో బయటపడ్డ సంచలనాలు!
ఫోన్ ట్యాపింగ్ విషయంలో..
ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) విషయంలో మాజీ మంత్రి కేటీఆర్(KTR) పేరును ప్రస్తావిస్తూ కథనాలు ప్రసారం చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు(BRS Activists) మహా న్యూస్పై దాడులకు పాల్పడ్డారు. మహా ఛానెల్ ఆఫీసులోకి చొరబడి అద్దాలు పగలగొట్టారు, కార్లు ధ్వంసం చేశారు. రామన్న పైనే కామెంట్స్ చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చూడండి: Car on a Railway Track : రైల్వే ట్రాక్పై కారు నడిపిన యువతి.. ఆమె మానస్థితిపై అనుమానంతో...
#MahaTV Office Attacked by #BRS Activists
— BNN Channel (@Bavazir_network) June 28, 2025
Chaos erupted at the Maha TV office as activists allegedly affiliated with the Bharat Rashtra Samithi (BRS) launched a violent attack on Saturday.
According to reports, the attackers vandalized the office premises, shattering windows… pic.twitter.com/w1ueap6pNy
ఇది కూడా చూడండి: MLC Kavita : దూకుడు పెంచిన కవిత..నిన్న కేంద్రమంత్రి, నేడు సీపీఐ ఎంపీతో భేటీ