/rtv/media/media_files/2025/06/11/HfZlHxjZMJ5qpS05e856.jpg)
Pre-primary classes
Pre-primary classes : తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ-ప్రైమరీ విద్య అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలోని 210 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: రేపు విచారణకు KCR.. BRS బిగ్ స్కెచ్ !
ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 5 ఏళ్లు నిండిన పిల్లలను మాత్రమే 1వ తరగతిలో చేర్చుకుంటున్నారు. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలలు మాత్రం నర్సరీ నుంచే విద్యను అందిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీనివల్ల ఉన్నత తరగతుల విద్యార్థులు తప్ప ప్రాథమిక తరగతుల్లో విద్యార్థులు కరువవుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన రిటైర్డ్ IAS అధికారి అకునూరి మురళి నేతృత్వంలోని రాష్ట్ర విద్యా కమిషన్ ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
ఇది కూడా చదవండి: ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..? ఓ అధ్యయనంలో చెప్పిన షాకింగ్ నిజాలు..!!
కాగా ఇంతకు ముందు కేవలం 5 ఏండ్లు నిండినవారిని మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకునేవారు. అది కూడా ఒకటో తరగతికి మాత్రమే. దీనివల్ల మూడేళ్లు నిండగానే ప్రీ ప్రైమరీ కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18,133 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉండగా ఈ ఏడాది మాత్రం 210 ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. అవసరమైతే వారికి ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి వారిని సక్రమంగా తరగతులకు వచ్చేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం.. అసలేం జరిగిందంటే..!