Congress: పొంగులేటికి షాక్.. మల్లికార్జున ఖర్గే వార్నింగ్

తెలంగాణ నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజనిజాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌కు ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

New Update
AICC President Malli Kharjuna Kharge Warning to Minister Ponguleti Srinivasa reddy

AICC President Malli Kharjuna Kharge Warning to Minister Ponguleti Srinivasa reddy

తెలంగాణలో మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలపై ఏఐసీసీ ఫోకస్ పెట్టింది. పార్టీనీ, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న నేతలను ఢిల్లీకి పిలిపించి మరి పార్టీ పెద్దలు మందలిస్తున్నారు. తెలంగాణ నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజనిజాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌కు ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

Also Read: జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి, జనాలపైకి దూసుకెళ్లిన ఏనుగులు.. VIDEO

పొంగులేటిపై ఫిర్యాదు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల అంశాన్ని అడిగి తెలుసుకున్నారు.  మంత్రులు, కీలక నేతలు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని ఖర్గే వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే మరికొందరు మంత్రులు, కీలక నేతలకు కూడా ఢిల్లీ నుంచి పిలుపు రానుంది.  స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలయ్యే లోపు ఇచ్చిన టాస్క్‌ పూర్తి చేయాలని ఖర్గే సూచనలు చేశారు. గతంలో పొంగులేటి పార్టీలో నేనే నెంబర్ 2 అన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్ గౌడ్ కూడా పొంగులేటికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: షాకింగ్ వీడియో.. తన మూత్రంతో కళ్ళు కడుకున్న మహిళ - దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలో విభేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో వారిపై తీసుకునే చర్యలపై చర్చించేందుకు గురువారం పార్టీ  క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురిపై చర్యలకు సిద్ధమైంది. నేతల మధ్య రోజురోజుకు పెరుగుతున్న గొడవలతో పార్టీ పరువు పోతుందని భావిస్తున్న అధిష్ఠానం గొడవలకు కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనికోసం ముందుగా క్రమశిక్షణ కమిటీలో చర్చించాలని నిర్ణయించింది. దీంతో కమిటీ వచ్చిన ఫిర్యాదులపై సుదీర్ఘంగా చర్చించింది. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ సమస్యలను పరిష్కరించేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేసినట్లు తెలిసింది.

Also Read: రూ.150 కోట్ల విలువైన 3 ఎకరాల భూమి.. డ్రైవర్‌కు గిఫ్ట్ ఇచ్చిన MP

Advertisment
Advertisment
తాజా కథనాలు