/rtv/media/media_files/2025/06/27/elephants-in-ahmedabad-rath-yatra-runs-amok-on-street-2025-06-27-15-10-06.jpg)
Elephants In Ahmedabad Rath Yatra Runs Amok On Street, Several Injured
దేశవ్యాప్తంగా పూరీ జగన్నాథుడి ఆలయాల్లో రథయాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో జగన్నాథుడి ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథయాత్ర నిర్వహిస్తుండగా మూడు ఏనుగులు అదుపుతప్పి భక్తుల పైకి దూసుకెళ్లాయి. ఏనుగులు తమపైకి రావడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
3 elephants went out of control during #AhmedabadRathyatra today. Crowd movement disrupted, no major injuries reported so far.
— Shahcastic - Mota bhai 😎 (@shahcastic) June 27, 2025
#RathYatra2025 pic.twitter.com/QZJjOPCCJb
Also Read: షాకింగ్ వీడియో.. తన మూత్రంతో కళ్ళు కడుకున్న మహిళ - దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయని ఆలయ అధికారులు తెలిపారు. ఆ తర్వాత పరిస్థితులు అదుపు చేయడంతో రథయాత్రను మళ్లీ కొనసాగించినట్లు పేర్కొన్నారు. రథయాత్ర ఊరేగింపులో భాగంగా ఖాదియా ప్రాంతం గుండా వెళ్తుండగా ఏనుగులు అదుపుతప్పాయన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు దాదాపు 23,800 మంది సెక్యూరిటీ సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. 16 కిలోమీటర్ల వరకు జరిగే ఈ రథయాత్ర వేడుకను చూసేందుకు దాదాపు 15 లక్షల మంది భక్తులు పాల్గొనే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన