/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీలకు AICC ఆమోదం తెలిపింది. డీలిమిటేషన్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, పొలిటికల్ ఎఫైర్ కమిటీ, క్రమ శిక్షణా కమిటీలకు సభ్యులు, చైర్మన్లు నియమించింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఏడుగురు సభ్యులున్న డీలిమిటేషన్ కమిటీ చైర్మన్గా వంశీచంద్ రెడ్డిని ప్రకటించింది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవిని ఎంపిక చేశారు. రాష్ట్రంలో మొదటి సారి15 మందితో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. అడ్వైజరీ కమిటీలో రేవంత్ రెడ్డి, మధుయాష్కీ, గీతారెడ్డి, జానారెడ్డిలకు చోటు దక్కింది.
*తెలంగాణలో కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం*
— Telangana Pradesh Congress Sevadal (@SevadalTL) May 29, 2025
22 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ..
15 మందితో అడ్వైజరీ కమిటీ..
ఏడుగురు సభ్యులతో డీలిమిటేషన్ కమిటీ..
కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర మంత్రులు,
కమిటీలో తెలంగాణ ఇంఛార్జ్ ఏఐసీసీ సెక్రటరీలకు స్థానం.. pic.twitter.com/3cLovfbxvv
16 మందితో సంవిధాన్ బచావో ప్రొగ్రాం కమిటీ ఏర్పాటు చేశారు. ప్రొగ్రాం కమిటీ చైర్మన్గా బాధ్యతలు పి.వినయ్ కుమార్కు అప్పగించారు. సభ్యులుగా అద్దంకి దయాకర్, బాలూనాయక్, నర్సారెడ్డి మరి కొందరు ఉన్నారు. పీపీసీ కార్యవర్గం, వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల గురించి ప్రస్తావించలేదు AICC. 22 మందితో పొలిటికల్ ఎఫైర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు ఉన్నారు. డీలిమిటేషన్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర మంత్రులు, కమిటీలో తెలంగాణ ఇంఛార్జ్ ఏఐసీసీ సెక్రటరీలకు స్థానం కల్పించారు.
telangana | congress-party | Revanth Reddy | minister-uttam-kumar | cm revanth | latest-telugu-news