Accident: ఆదిలాబాద్‌లో భయంకరమైన యాక్సిడెంట్..70 మందికిపైగా భక్తులు!

తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగ్ బాయ్ దర్శనానికి 70 మందికి పైగా భక్తులతో వెళ్తున్న లారీ మలంగి ఘాటు వద్ద బోల్తా పడింది. 69 మందికి స్వల్ప గాయాలవగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురి పరిస్థితి విషమం ఉంది. క్షతగాత్రులంగా సూర్యగూడ వాసులే.

New Update
accident (1)1

Adilabad: తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొక్కు తీర్చుకునేందుకు వెళ్తున్న భక్తులకు అనుకోని సంఘటన ఎదురుపడటంతో ఉలిక్కిపడ్డారు. పలువురు స్వల్పంగా గాయపడగా మరికొందరికీ తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. 

జంగ్ బాయ్ దర్శనానికి వెళ్తుండగా.. 

ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్ మండలం మలంగి ఘాటు వద్ద ఐచర్ లారీ బోల్తా పడింది. జంగ్ బాయ్ దర్శనానికి 70 మందికి పైగా భక్తులు వెళ్తున్న లారీ అనుకో కుండా రోడ్డు దిగి పల్టీ కొట్టడంతో 69 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అందులో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమం ఉండటంతో స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులంగా గుడిహత్నూర్‌ మండలం సూర్యగూడ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు మలంగా పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: UGC-NET: యూజీసీ- నెట్ అడ్మిట్ కార్డులు విడుదల

ఇదిలా ఉంటే.. చిత్తూరు జిల్లా పనబాకం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐ10 కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో తమిళనాడుకి చెందిన వారు ప్రయాణిస్తున్నట్లుగా ప్రాథమికంగా నిర్దారించారు. కారులో ఒకరి పరిస్థితి విషమం, ఇద్దరికీ తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చదవండి: Seethakka: మీ కపట ప్రేమ గురించి ప్రజలకు తెలుసు: హరీష్ రావుకు సీతక్క కౌంటర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు