ACB Raids: తెలంగాణలో 12 చోట్ల ACB దాడులు.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పని చేసిన ఇంజనీర్ ఇంటిపై రైడ్స్

తెలంగాణలో బుధవారం ఉదయాన్నే ఏకకాలంలో వేర్వేరు 12 చోట్ల ఏసీబీ దాడులకు దిగింది. ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (SE)గా పని చేసిన నూనె శ్రీధర్‌కు సంబంధించిన ఆస్తులపై ఏసీబీ రైడ్స్ చేసింది. నూనె శ్రీధర్‌పై ఆధాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.

New Update
ACB raids

తెలంగాణలో బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు విరుచుకుపడ్డారు. ఉదయాన్నే ఏకకాలంలో వేర్వేరు 12 చోట్ల ఏసీబీ దాడులకు దిగింది. ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE)గా పని చేసిన నూనె శ్రీధర్‌కు సంబంధించిన వాసాలపై ఏసీబీ రైడ్స్ చేసింది. నూనె శ్రీధర్‌పై ఆధాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఏకకాలంలో హైదరాబాద్‌, కరీంనగర్‌, సిద్దిపేటలోని 12 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీల పనులను పర్యవేక్షించారు. 

Also Read :  హై టెన్షన్: BRK భవన్ వద్ద భారీ బందోబస్తు

ACB Raids In Telangana

Also Read :  భర్త హత్యకు 20 లక్షల సుపారీ.. తానే స్వయంగా డెడ్ బాడీని తోసేసిన సోనమ్

ఆయన్ని అదుపులోకి తీసుకొని అధికారులు విచారిస్తున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనూ నూనె శ్రీధర్ పని చేశారు. శ్రీధర్‌ SRSP డివిజన్‌-8లో ఈఈగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్‌ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు శ్రీధర్‌పై ఆరోపణలున్నాయి. కాళేశ్వరం విచారణ ముందుకు కేసీఆర్ హాజరవుతున్న వేళ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజే కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి హాజరవుతున్నా వేళ ఈ ఏసీబీ దాడులు చర్చనీయాంశమయ్యాయి. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో నూనె శ్రీధర్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసులు, బంధువుల నివాసాలపై 12 చోట్లు రైడ్స్ చేశారు. 

అటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు హాజరవుతున్న కేసీఆర్ ఫాంహౌస్‌కు కవిత చేరుకున్నారు. బీఆర్ఎస్  పార్టీలో కవిత లేఖ రాసిన లేఖ తర్వాత మొదటి సారి ఆమె తండ్రి కేసీఆర్‌ను కలిశారు.

Also Read :  ఫుల్ ఎంటర్ టైనింగ్ గా 'సితారే జమీన్ పర్' తెలుగు ట్రైలర్.. మీరు చూశారా?

Also Read :  ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!

acb-raids | latest-telugu-news | irrigation-department | Noone Sridhar

Advertisment
Advertisment
తాజా కథనాలు