/rtv/media/media_files/2025/02/28/8nDKdfh2y06qyVbUOZHd.jpg)
Telangana cabinet meeting
తెలంగాణ కేబినెట్ సోమవారం సమావేశమైంది. అందులో పది కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. అందులో భాగంగా ఈరోజు సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 2 వేల మంది రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం నిర్వహించనుంది ప్రభుత్వం.
Also Read : కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన..సీజ్ ఫైర్ స్టార్ట్
Also Read : 12 రోజుల యుద్ధం.. ఎవరికి ఎంత నష్టమంటే?
Telangana Cabinet Meeting
1. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం రైతు భరోసాను విజయవంతంగా రికార్డు వేగంతో అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతునేస్తం కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో 9వేల కోట్లు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. కోటీ 49 లక్షల ఎకరాలకు ఈ సాయాన్ని పంపిణీ చేసింది. దీనికోసం రైతుల సమక్షంలోనే ఉత్సవంగా జరుపుకోవాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 2 వేల మంది రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం నిర్వహిస్తుంది.
అన్ని జిల్లాల్లో రైతు వేదికలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని నిర్ణయం తీసుకుంది.
2. తెలంగాణలో ప్రతీ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం. డిసెంబర్ 9వ తేదీన అన్ని జిల్లాల్లో ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని ఆదేశాలు పంపనున్నారు.
3. హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్ మెంట్ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. ఆర్ అండ్ బీ విభాగం తయారు చేసిన మూడు ప్రతిపాదనలను ఈ సందర్భంగా కేబినేట్ పరిశీలించింది. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలో మీటర్ల పొడవు ఉండే అలైన్ మెంట్ కు తుది ఆమోదం తెలిపింది.
4. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఏపీ తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ను వ్యతిరేకించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి స్వయంగా ఢిల్లీకి వెళ్లి కలిసి విజ్ఞప్తి చేశారు. చట్టపరంగా, న్యాయపరంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని కేబినెట్ తీర్మానించింది.
5. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశంలో చర్చించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Also Read : ఒకే బైక్పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు చిక్కడంతో.. (వీడియో)
6. కాళేశ్వరం ప్రాజెక్టు పై పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై కేబినెట్ చర్చించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న పూర్తి వివరాలను జూన్ 30 లోగా కమిషన్ కు అందివ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
7. రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేలా, క్రీడా ప్రమాణాలను పెంపొందించేలా రూపొందించిన తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ ని కేబినెట్ ఆమోదించింది. ఈ పాలసీలో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేస్తారు. తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధి (TSDF)ని ఏర్పాటు చేస్తుంది. జిల్లాలో క్రీడా అభివృద్ధికి ప్రతి ఏడాది జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో ఉండే క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ (CBF) లో పది శాతం కేటాయించాలన్న నిర్ణయాన్ని ఆమోదించింది. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లకు అర్హత జాబితాలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి విజేతలకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
8. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 9 న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలని నిర్ణయించారు. దేశ ఎకానమీలో పదో వంతు సంపదను అందించే రాష్ట్రంగా తెలంగాణ వృద్ధి సాధించాలనే భారీ లక్ష్యం తో ఈ విజన్ రూప కల్పన చేయాలని కేబినెట్ అధికారులకు దిశా నిర్దేశం చేసింది.
9. పరిపాలన సంస్కరణల్లో భాగంగా ఇకపై ప్రతి మూడు నెలలకోసారి కేబినెట్ మీటింగ్ ను స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ గా నిర్వహించాలని నిర్ణయం. ఆ మూడు నెలల్లో జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు పై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ను ఈ ప్రత్యేక భేటీ లో సమర్పించి చర్చిస్తారు. ఈ మూడు నెలల ప్రత్యేక భేటీకి మంత్రివర్గం తో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశం లో పాల్గొంటారు.
10. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది.
వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కమిషనర్ల తో పాటు వివిధ విభాగాల్లో 316 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
Also Read : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లికి తీవ్ర అస్వస్థత!
latest-telugu-news | cm-revanth-reddy | Telangana Cabinet Meeting News | Telangana Cabinet | cm revanth telangana cabinet decisions