Iran-Israel War: 12 రోజుల యుద్ధం.. ఎవరికి ఎంత నష్టమంటే?

ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులతో మొదలైన యుద్ధం 12 రోజులు కొనసాగింది. అమెరికా కూడా ఎంటర్ అవడంతో ఈ వార్ మరింత ముదిరింది. ఈరోజు రెండు దేశాలు సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకోవడంతో దీనికి ఎండ్ కార్డ్ పడింది. అయితే ఈ వార్ కారణంగా ఇరు దేశాలకూ కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 

New Update
war

Iran-Israel War

12 రోజుల పాటూ ఇజ్రాయెల్, ఇరాన్ జరిపిన యుద్ధంలో...రెండు దేశాలూ భారీగా నష్టపోయాయి. ఇరాన్  పై ఇజ్రాయెల్ చాలా ఎక్కువగా దాడులు చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దళం 330 కి పైగా ఆయుధాలతో పాటు 200 కి పైగా యుద్ధ విమానాలను ప్రయోగించింది. వీటిల్లో దాదాపు 800మంది దాకా మరణించారు. వారిలో 54 మంది మహిళలు , పిల్లలు 263 మంది సామాన్య పౌరులు ఉన్నారు. ఇజ్రాయెల్ లో కూడా 50మంది దాకా చనిపోయారు. అలాగే 1,800 నుండి 3,056 మంది గాయపడ్డారు. టెహ్రాన్‌లోని తాజ్రిష్ స్క్వేర్‌లో పిల్లలు, గర్భిణీ స్త్రీ సహా 12 మంది మరణించారు. కోమ్‌లోని నివాస భవనంపై జరిగిన దాడిలో 16 ఏళ్ల యువకుడు సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు.

అలాగే ఇరాన్ లోని అత్యంత కీలక అణు స్థావరాలైన నటాంజ్, ఫోర్డూ, పార్చిన్ వంటివి ధ్వంసం అయ్యాయి. టెహ్రాన్ లో పలు ప్రాంతాలు బాంబుల దాడికి నాశనం అయ్యాయి. చాలా మంది జీవనం స్తంభించి పోయింది. దీని వలన ఇరాన్ ఆర్థికంగా 150 నుంచి 200 బిలియన్ల డాలర్ల వరకూ నష్టపోయింది. టెహ్రాన్‌లో మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం $6.5 బిలియన్లు నష్టపోయిందని క్రిప్టో ట్రెన్చీ అంచనా వేసింది.  ఇక ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందిన ఉన్నతాధికారులు, న్యూ క్లియర్ సైంటిస్టులు కూడా మరణించారు. 

ఇజ్రాయెల్ కు కూడా భారీ నష్టం..

ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా ప్రతీకార దాడులను చేసింది. 50 కి పైగా క్షిపణులు మరియు 1,000 డ్రోన్‌లను ప్రయోగించింది. టెల్ అవీవ్, హైఫా, బీర్ షెవా వంటి నగరాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇక ఇక్కడ చనిపోయిన వారి లెక్కల విషయానికి వస్తే దాదాపు 50 మంది దాకా చనిపోయి ఉంటారని చెబుతున్నారు. అలాగే 300 నుంచి 600 మంది దాకా గాయపడ్డారని తెలుస్తోంది. బాంబుల దాడి సమయంలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ బట్యామ్‌లో తొమ్మిది మంది మరణించారు మరియు 200 మంది గాయపడ్డారు. తామ్రా లో ఇరాన్ క్షిపణి దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు మృతి చెందారు. అలాగే టెల్ అవీవ్ లో రామత్ అవీవ్‌లో 16 మంది గాయపడ్డారు. వీరిలో 30 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ రోజు ఇరాన్ చేసిన దాడుల్లో కూడా ముగ్గురు చనిపోయారు. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ 12 బిలియన్లను కోల్పోయినట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు 4.2 బిలియన్లు, పారిశ్రామిక నష్టాలు 1.9 బిలియన్లు నష్టపోయింది. 

వీటన్నిటితో పాటూ హార్ముజ్ జలసంధి మూసివేత భయాలతో చమురు ధరలు పెరిగాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది. ఇరాన్ నుండి చమురు దిగుమతి చేసుకునే చైనా యుద్ధం వల్ల అత్యంత ఎక్కువగా ప్రభావితమైంది. ఇజ్రాయెల్ లోని హైఫాలో చమురు శుద్ధి కర్మాగారం మూసివేయడం వల్ల కూడా ఇంధన సరఫరాపై ప్రభావం పడింది.

 

Also Read: ceasefire: కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన..సీజ్ ఫైర్ స్టార్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు