/rtv/media/media_files/2025/05/29/4egwqYtMfKBCtomwdc7W.jpg)
10 gates lifted in jurala project Due to Heavy rains
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గత 18 ఏళ్లలో చూసుకుంటే మే నెలలో జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ఇదే మొదటిసారని అక్కడున్న స్థానిక ప్రజలు చెబుతున్నారు.
Also read: కవిత వివాదం.. బీజీపీలో బీఆర్ఎస్ విలీనం.. బీఆర్ఎస్ నేత వినోద్ సంచలనం!
Jurala Project
మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాల కురుస్తున్నాయి. దీంతో జూరాల ప్రాజెక్టులో గురువారం ఉదయానికి 6,900 క్యూసక్కుల వరద.. మధ్యాహ్న నాటికి ఏకంగా 80 వేల క్యూసెక్కులకు చేరింది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి జలాశయంలో నీటినిల్వ 7.682 TMCలకు చేరింది. ఇక సాయంత్రం 6.00 గంటలకు వరద 66 వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
Also Read: ఎన్నికల్లో తేల్చుకుందాం.. ప్రధాని మోదీకి మమతా బెనర్జీ కౌంటర్
ఇదిలాఉండగా.. మహారాష్ట్రలోని ఉజని డ్యాం పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ జలాశయంలోకి కూడా వరద పోటెత్తుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం రాత్రి నాటికి జూరాలకు వచ్చే వరద లక్ష క్యూసెక్కుల వరకు చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
Also Read : తెల్లటి మచ్చలను వదిలించుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి
telugu-news | rtv-news | Heavy Rains