Telangana BJP Master Plan: ఉత్తరాదిలో బలమైన పార్టీకి ఉన్న బీజేపీ.. దక్షిణాదిలో మాత్రం అనామక పార్టీగా మిగిలిపోయింది. నిన్నటి వరకు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక కూడా చేజారిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా దక్షిణాది రాష్ట్రాల్లో పాగ వేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యంగా బలమైన క్యాడర్ ఉన్న తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర నేతలో వరుస భేటీలు నిర్వహిస్తోంది. అలాగే అగ్రకులాల పార్టీ అనే ముద్రను తొలగించే దిశగా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న 31 రిజర్వుడు స్థానాలపై గురి పెట్టింది. 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజవర్గాలకు చెందిన నేతలతో కిషన్ రెడ్డి (Kishan Reddy), సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ప్రకాశ్ జవదేవకర్. ఈటల రాజేందర్ (Etela Rajender) భేటీ అయి దిశానిర్దేశం చేశారు. ఈ స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించారు.
పూర్తిగా చదవండి..Telangana BJP Master Plan: టార్గెట్ 31.. తెలంగాణ బీజేపీ మాస్టర్ స్ట్రోక్..!
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కొత్త స్కెచ్ వేస్తోంది. అగ్రకులాల పార్టీ అనే ముద్ర తొలగించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రిజర్వుడు స్థానాల నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసింది.
Translate this News: