Karimnagar : నేడే పందెం కోడి వేలం.. చరిత్రలో నిలిచిపోనున్న కరీంనగర్
జనవరి 09న కరీంనగర్-సిరిసిల్ల బస్ లో దొరికిన పందెం కోడి వేలం నేడు కరీంనగర్ డిపోలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఆసక్తిగలవారు ఈ వేలం పాటలో పాల్గొనాలని ఆర్టీసీ కోరడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఆర్టీసీకి ఈ కోడి ఎంత ఆదాయం తెస్తుందనే విషయం ఆసక్తికరంగామారింది.