Sofiya Qureshi: కవ్వింపు చర్యలకు దిగి పాక్ తీవ్రంగా నష్టపోయింది : సోఫియా ఖురేషి
పాకిస్తాన్ చేసిన అన్ని ప్రచారాలు అబద్ధమని, భారత ఆర్మీ సీనియర్ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. పాక్ చెప్పినట్లు భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.