Bheemili Teacher Incident | ఆకతాయి వేధింపులకు టీచర్..| Visakhapatnam | RTV
అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో గత ప్రభుత్వం భద్రతా చర్యలను విస్మరించడమే ఇందుకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు
విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ షెడ్యూల్లో మార్పులు చేశారు అధికారులు. ప్రస్తుతం ఈ రైలు ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులూ నడుస్తోంది. ఇప్పుడు ఈ సెలవును మంగళవారానికి మార్చారు.
AP: వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. విశాఖలో ఒక పోలీస్ స్టేషన్ ఇంకా రేకుల షెడ్డులో నడుస్తోందని తెలిపారు. పోలీసుశాఖకు ఇవ్వాల్సిన నిధులను గత ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు.
విశాఖలో ఆర్కే బీచ్ దగ్గర అర్థరాత్రి ఓ యువకుడు హల్ఛల్ చేశాడు. యోగ విలేజ్ దగ్గర హోర్డింగ్ ఎక్కి గోలగోల చేశాడు. అతన్ని అక్కడ నుంచి దింపడానికి పోలీసులు నానాపాట్లు పడ్డారు.
కంబోడియాలో 300 మంది భారతీయులను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని అక్రమంగా కంబోడియాకు తీసుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
Worlds Luxury Cruise Ship to Visakhapatnam: ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రూయిజ్ విశాఖ పోర్టుకు ఆదివారం చేరుకుంది.
విశాఖలో రెండు రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్య్సకారులు అప్పికొండ బీచ్ వద్ద క్షేమంగా చేరుకున్నారు. రాత్రి 3.00 గంటల సమయంలో మత్య్సకారులు తీరానికి చేరుకున్నారు. స్థానికులు సాయంతో వారు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.