/rtv/media/media_files/2025/06/11/XqenHbJ8OsQfQnhRBbgV.jpg)
Thalliki Vandanam
Thalliki Vandanam : కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుక గా తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం పథకం నిధులు 67 లక్షల మందికి రేపు ఖాతాల్లో ప్రభత్వం జమ చేయనుంది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
#TallikiVandanam #AndhraPradesh
— Lokesh Nara (@naralokesh) June 11, 2025
విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం.
సూపర్ సిక్స్… pic.twitter.com/CCENI7KKCS
రాష్ట్రంలోని 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తింపు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది,1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని మాటిచ్చింది. దీనికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేస్తూ నేడు జీ.వో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
కాగా ఈ విషయమై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అని తెలిపిన లోకేష్ అందరికీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నామన్నారు.
సూపర్ సిక్స్లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషం. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ 'తల్లికి వందనం' పథకం అందుతుంది. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తాం. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం, తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చింది. అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
Also Read : ఆ కామాంధుడు ట్రంప్పై 34 కేసులు.. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఇదే!!