BREAKING: నేపాల్ తాత్కాలిక ప్రభుత్వంలోకి ముగ్గురు కొత్త మంత్రులు
నేపాల్ తాత్కాలిక ప్రభుత్వం మంత్రివర్గం విస్తరించింది. కొత్తగా ముగ్గురు మంత్రులను కేబినెట్లోకి తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రధానితో సహా నలుగురు సభ్యులు ఉన్నారు. రామేశ్వర్ ఖనాల్, ఓం ప్రకాష్ ఆర్యల్, కుల్మాన్ ఘిసింగ్లు నేడు మంత్రులుగా బాధ్యలు చేపట్టారు.