/rtv/media/media_files/2025/09/14/sushila-karki-says-2025-09-14-21-24-59.jpg)
నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కార్కి 'జనరేషన్ జెడ్' నిరసనల్లో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ నిరసనలలో విధ్వంసానికి పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకువచ్చి, వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల నేపాల్ను కుదిపేసిన ‘జనరేషన్ జెడ్’ నిరసనల తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కార్కి, తన తొలి ప్రసంగంలోనే ఈ ప్రకటన చేశారు. నిరసనల కారణంగా చెలరేగిన హింసలో 72 మంది మృతి చెందారు. దాదాపు 1,368 మంది గాయపడినట్లు నివేదికలు తెలిపాయి.
హింసకు పాల్పడిన వారిపై చర్యలు, నిరసనల సందర్భంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారం, గాయపడిన వారికి చికిత్స అందిస్తామని తెలిపారు. అలాగే హింసాకాండలో మరణించిన వారిని 'అమరవీరులు'గా ప్రకటించారు తాత్కాలిక ప్రధాని కార్కి. వారి కుటుంబాలకు రూ. 1 మిలియన్ (నేపాలీ కరెన్సీ) చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి ప్రభుత్వమే చికిత్స ఖర్చులను భరిస్తుందని కూడా ఆమె తెలిపారు.
Kathmandu: Days after taking charge as the interim Nepal Prime Minister, Sushila Karki says, "Those involved in the incident of vandalism will be investigated.''
— The Truth India (@thetruthin) September 14, 2025
she said, "My team and I are not here to taste the power. We won't stay for more than 6 months. We will hand over… pic.twitter.com/dg1WhdniyJ
నిరసనలలో ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ ఆస్తులకు జరిగిన నష్టాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. "ప్రజాస్వామ్య నిరసనల మాటున జరిగిన విధ్వంసం, ఒక పథకం ప్రకారం జరిగిన కుట్రగా కనిపిస్తోంది" అని ఆమె అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి, విచారించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. విధ్వంసంలో నష్టపోయిన ప్రైవేట్ ఆస్తులకు కూడా ప్రభుత్వం సహాయం చేస్తుందని ఆమె హామీ ఇచ్చారు.
ఆమె తాత్కాలిక ప్రభుత్వం కేవలం ఆరు నెలల పాటు మాత్రమే అధికారంలో ఉంటుందని, ఈ సమయంలో దేశంలో శాంతిభద్రతలను పునరుద్ధరించి, త్వరలో ఎన్నికలు నిర్వహించి, అధికారాన్ని నూతన పార్లమెంటుకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, ఆమె దేశ ఆర్థిక సంక్షోభాన్ని కూడా ప్రస్తావించి, ఆర్థిక పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 'జనరేషన్ జెడ్' యువత ఆశించిన విధంగా, అవినీతి రహిత పాలనను అందిస్తామని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని ఆమె హామీ ఇచ్చారు.