/rtv/media/media_files/2025/09/10/sushila-karki-2025-09-10-18-07-04.jpg)
నేపాల్లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి పరిష్కారం కోసం 'జెన్-జెడ్' ఆందోళనకారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కిని నాయకురాలిగా ఎంపిక చేశారు. ఆందోళనల కారణంగా ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక సుశీలా కర్కి గతంలో కూడా కీలక బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఆమెనే కోరుకున్నారు జెడ్ జనరేషన్ యువత.
Former Chief Justice Sushila Karki is the most popular name & appearing to be GEN Z's important choice as a leader for now! pic.twitter.com/uqeEtIQWNj
— Routine of Nepal banda (@RONBupdates) September 10, 2025
దీంతో నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి సుశీలా కర్కిని నాయకత్వం వహించనున్నారు. యువ 'జెన్-జెడ్' బృందం జూమ్ సమావేశం ద్వారా విస్తృత చర్చలు జరిపింది. ఈ సుదీర్ఘ చర్చల అనంతరం, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడానికి సుశీలా కర్కి అత్యంత అనుభవజ్ఞురాలని, ఆమె సమర్థవంతంగా దేశాన్ని ముందుకు నడిపించగలరని ఏకగ్రీవంగా నిర్ణయానికి వచ్చారు.
Decision locked!!
— guragain_in_KU (@prabeshguragai) September 10, 2025
Gen Z approaching Sushila Karki, Sagar Dhakal as backup. Random Nepali as advisor. pic.twitter.com/pTTh6aidPx
సుశీలా కర్కి నేపాల్ సుప్రీంకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తన పదవీకాలంలో ఆమె అనేక అవినీతి కేసులలో కఠినమైన తీర్పులు ఇచ్చి, న్యాయవ్యవస్థలో ఆమె నిజాయితీ, ధైర్యాన్ని చాటుకున్నారు. ఆమె నిర్ణయాలపై మాజీ ప్రధాని ఓలీ తీవ్రంగా స్పందించి, ఆమెపై అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. అయినప్పటికీ, ప్రజల మద్దతు, న్యాయస్థానం జోక్యంతో ఆ తీర్మానం వీగిపోయింది. ఆమె నిజాయితీ, నిష్పక్షపాత వైఖరి కారణంగానే 'జెన్-జెడ్' ఆమెను ఎంపిక చేసింది.
Former Chief Justice Sushila #Karki emerges as the interim leader for #Nepal. Will lead the GenZ talks with the Army for the formation of the new set up
— Snehesh Alex Philip (@sneheshphilip) September 10, 2025
pic.twitter.com/RSpHOmXFnB
'జెన్-జెడ్' యువత తీసుకున్న ఈ నిర్ణయం నేపాల్ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆందోళనకారుల ప్రతిపాదనకు ఆమె అంగీకరించినట్లు సమాచారం. సుశీలా కర్కి నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయాలపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, ఒక న్యాయమూర్తిని తాత్కాలిక ప్రభుత్వానికి నాయకురాలిగా ఎంపిక చేయడం దేశ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం.