Breaking : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.బాపట్ల జిల్లా చిన గంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ను అతి వేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.బాపట్ల జిల్లా చిన గంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ను అతి వేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.
ఏపీలో ఎన్నికల ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. పల్నాడు జిల్లా కారెంపూడిలో టీడీపీ ఆఫీస్పై వైసీపీ వర్గీయుల ఎటాక్ చేశారు. టీడీపీ నేత జానీబాషా కారుకు నిప్పు అంటించారు. ఆపేందుకు ప్రయత్నించిన సీఐ నారాయణస్వామిపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది.
AP: పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా దాచేపల్లి మండలం తంగెడలో వైసీపీ, టీడీపీ వర్గాలుగా గ్రామస్తులు విడిపోయారు. నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పోలింగ్ మొదలు అయింది. అక్కడక్కడా ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. పల్నాడులో పోలింగ్ మొదలవ్వక ముందే వైసీపీ, టీడీపీల మధ్య గొడవలు జరిగాయి. ఏకంగా తలలు పగిలాయి. దీంతో కేంద్ర బలగాలను రప్పించండి..పల్నాడులో ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
పల్నాడు జిల్లాలో ఇద్దరు సీఐలు, ఒక ఏస్.ఐపై వేటు పడింది. మాచెర్ల టౌన్ SHO శరత్, కరెంపూడి సర్కిల్ ఇన్ స్పెక్టర్ చిన్న మల్లయ్య, వెల్దుర్తి S.I వంగా శ్రీహరిలను బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బస్స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు - ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అక్కను వేధిస్తున్నారనే కోపంతో బావ, అతని తల్లిదండ్రులను దారుణంగా నరికి చంపిన సంఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకిలో చోటుచేసుకుంది. ఈ హత్యలకు పాల్పడిన మాధురి, సోదరుడు శ్రీనివాసరావు, తండ్రి సుబ్బారావు ముప్పాళ్ల పీఎస్లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.