Road Robbery : నంద్యాల శివారులో రెచ్చిపోయిన దారి దోపిడి దొంగలు
నంద్యాలలో దారి దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. రైతునగర్ వద్ద వాహనదారుడి పై దొంగలు దాడి చేసి దోచుకున్నారు. దారిలో వెళ్తున్న కారుపై రాళ్లతో దాడిచేసిన దుండగులు కారు ఆపగానే డ్రైవర్ ప్రభాస్ పై కత్తులు, కట్టెలతో దాడి చేశారు. దీంతో ప్రభాస్ తీవ్రంగా గాయపడ్డాడు.