BREAKING: 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

AP: నంద్యాల SDR స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఆహారం తిన్న విద్యార్థులు కాసేపటికే వాంతులు చేసుకున్నారు. వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

New Update
BREAKING: ఏపీలో ఫుడ్ పాయిజన్‌ కలకలం.. నలుగురు విద్యార్థులు మృతి!

Nandyal: నంద్యాల SDR స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఆహారం తిన్న విద్యార్థులు కాసేపటికే వాంతులు చేసుకున్నారు. వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయిన విషయాన్ని గోప్యంగా ఉంచిన స్కూల్ యజమాన్యంపై ఉన్నత అధికారులు సీరియస్ అయ్యారు. విషయం తెలిసి అర్థరాత్రి దీనిపై ఉన్నత అధికారులు విచారణ జరిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు