ఇద్దరు పిల్లలను ఎందుకు చం*పిందంటే.. | Medchal Mother And Sons Incident | RTV
సంచలనంగా మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 6పేజీల సూసైడ్ నోట్ రాసిన తేజస్వీని అనంతరం కొబ్బరి బోండాల కత్తితో ఇద్దర్ని నరికేయాలని అనుకుంది. కొడుకులు పారిపోతున్నా సరే వెంటబడి మరి నరికేసింది.
మేడ్చల్ రైల్వే స్టేషన్ లో దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ యువతిపై అత్యాచారానికి యత్నించారు. అదృష్టవశాత్తు యువతి వారిని రాయితో కొట్టి తప్పించుకుంది. అనంతరం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్లో బాంబ్ బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ పేల్చివేస్తామంటూ ఆగంతకుడు మెయిల్ పెట్టాడు. కలెక్టర్ గౌతం డీసీపీ పద్మజారెడ్డికి ఆదేశాలు ఇవ్వడంతో అప్రమత్తమయ్యారు. మావోయిస్టు పేరిట మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.
వాటర్ హీటర్ బకెట్లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్లి హీటర్ బకెట్లో పడ్డాడు. వేడినీళ్లలో పడిపోవడంతో బాలుడి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
హైదరాబాద్లో దారుణ ఘటన జరిగింది. బెట్టింగ్ యాప్ మోసానికి మరో యువకుడు బలి అయ్యాడు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన సోమేష్ అక్క పెళ్లి కోసం దాచిన రూ.2 లక్షలను బెట్టింగ్లో పెట్టాడు. అవి పోవడంతో మనస్తాపం చెంది రైలు కింద పడి బలవన్మరణం చేసుకున్నాడు.
ఆమెకు పెళ్లైంది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె మరోకరిపై మనసు పడింది. అతడే కావాలనుకుంది. కట్టుకున్న భర్త, కన్న ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయింది ఓ వివాహిత. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.