/rtv/media/media_files/2025/02/20/VjgPhTTjq7gFKRigmOSo.jpg)
Maganti Gopinath
Maganti Gopinath : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్న ఆయనకు డాక్టర్లు వెంటిలేటరప్ చికిత్స అందిస్తున్నారు. గోపినాథ్ కిడ్ని సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గతంలో ఒకసారి ఆయన చికిత్స కూడా తీసుకున్నారు. తిరిగి ఆయనకు మళ్లీ సమస్య రావడంతో పాటు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Also Read : అఖిల్-జైనాబ్ పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నాగార్జున
ఆయనను ఆసుపత్రికి తరలించిన సమయంలో కార్డియాక్ అరెస్టు అయినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే సీపీఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చింది, కానీ.. ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. నిన్న నలభై ఎనిమిది గంటల సమయం గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మరింత విషమించడంతో మరికొంతకాలం గడిస్తే తప్ప ఏం చెప్పలేమంటున్నారు. కాగా ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు హరీష్రావు తదితరులు నిన్న కుటుంబాన్ని పరమార్శించారు.
Also Read : ప్రధాని మోదీకి G7 సమ్మిట్ ఆహ్వానం
మరో వైపు మంత్రి శ్రీధర్బాబు ఆసుపత్రిలో గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గోపీనాథ్ తనకు సన్నిహితుడని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశాల్లో ఉండటంతో గోపీనాథ్ కుటుంబ సభ్యులకు తోడుగా ఆయన భార్య కేటీఆర్ సతీమణి శైలిమ ఉన్నారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని ఆమె ఎప్పటికప్పుడు కేటీఆర్కు తెలియజేస్తున్నారు. కాగా గోపినాథ్ ఆరోగ్యం విషమించిందని తెలిసి కేటీఆర్ హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు.ఈ రోజు ఉదయం ఆయన ఆసుపత్రికి వెళ్లి గోపినాథ్ కుటుంబాన్ని పరమార్శించనున్నారు.
Also Read : ‘ఆ దెయ్యాలకు నాయకుడు సమాధానం చెప్పాలి’