Karishma Sharma: కదులుతున్న రైలు నుండి దూకేసిన హీరోయిన్.. తల, వీపుకు గాయాలు
బాలీవుడ్ నటి కరిష్మా శర్మ ముంబైలో కదులుతున్న లోకల్ రైలు నుండి దూకి గాయపడ్డారు. తన స్నేహితులు రైలు ఎక్కలేదని గమనించి భయంతో ఆమె దూకేసింది. ఈ ఘటనలో ఆమె వెన్ను, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె అభిమానులను ప్రార్థనలు కోరారు.