Hyderabad: హైదరాబాద్లో గణేష్ శోభాయాత్రకు రూట్లు ఇవే!
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్దమైంది. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్ తో పాటుగా సిటీలోని 20 ప్రధాన చెరువులు, 72 బేబీ పాండ్స్ లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు అధికారులు.
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్దమైంది. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్ తో పాటుగా సిటీలోని 20 ప్రధాన చెరువులు, 72 బేబీ పాండ్స్ లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఖైరతాబాద్ గణేష్ను నిమజ్జనం చేసే ముందు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హోమం నిర్వహించి ఆ తర్వాత కలశం తొలగిస్తారు. ఆ తర్వాత హారతి ఇచ్చి శోభాయాత్ర నిర్వహిస్తారు. చివరిగా నిమజ్జనం చేసే ముందు మరోసారి హారతి ఇస్తారు.
ఘట్కేసర్ నుంచి గణపతి విగ్రహాన్ని లారీలో హిమాయత్నగర్లోని అపార్ట్మెంట్కు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో రోడ్డు నంబర్ 5 వద్ద మలుపు తిరుగుతుండగా.. విగ్రహం తల భాగం విద్యుత్ తీగలకు, కేబుళ్లకు తగిలింది. దీంతో విగ్రహం లారీపై నుంచి రోడ్డుపై పడిపోయింది.
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాబోయే 6 నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయని ఆయన అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలో ఓడిపోవడం ఖాయమని KTR ధీమా వ్యక్తం చేశారు.
ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం ahs పాఠశాలలో విశాల్ అనే SGT టీచర్ మద్యం సేవించి పాఠశాలకు రావడంతో విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా హరీశ్రావు, సంతోష్రావు ను లక్ష్యంగా చేసుకుని కవిత సంచలన ఆరోపణలు చేశారు. సంతోష్రావు గురించి పెద్దగా చెప్పుకునేంత సీన్ లేదంటూనే పలు ఆరోపణలు చేశారు. ఆయన ధనదాహం అన్నారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెన్సన్ పై ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలపాలు నిర్వహిస్తున్నానన్నారు. గులాబీ కండువా కప్పుకుని ప్రజా సమస్యల పై పోరాటం చేయడం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడమా అని కవిత ప్రశ్నించారు.
తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం బలపడుతున్న తరుణంలో హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఒక మార్వాడీ పై ఆర్కేపురం బీజేపీ కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డి దాడి చేశాడు. అయితే ఈ దాడికి రాజకీయ విభేదాలే కారణమని తెలుస్తోంది.