Kumari Aunty: వరద బాధితులకు కుమారి ఆంటీ సహాయం.. రూ. 50000 విరాళం!
తెలంగాణ వరద బాధితులకు తన వంతు సహాయం చేసేందుకు కుమారి ఆంటీ ముందుకొచ్చారు. వరదల్లో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 50000 విరాళాన్ని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును కుమారి ఆంటీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి అందించారు.