సీఎం రేవంత్,కిషన్, బండి, భట్టి ల హంగామా... ! | Kishan, CM Revanth, Bandi And Bhatti Hungama | RTV
రేవంత్ సర్కార్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తికావొచ్చిందని.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కాజీపేటలో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి సిద్ధమవుతుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. గూడ్సు వ్యాగన్లు, ఇంజిన్లు, రైల్వే కోచ్లు తయారవుతాయని చెప్పారు. దీనివల్ల 3 వేల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు.
మూసీ పక్కన వేలాది దేవాలయాలు ఉన్నాయని.. వాటికి కూల్చే దమ్ముందా? అని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. లక్షల కోట్లు అప్పు తెచ్చి మూసీ ప్రాజెక్టు అవసరమా? అని ప్రశ్నించారు. ఈ రోజు మూసీ పరివాహక ప్రాంతంలో కిషన్ రెడ్డి పర్యటించారు.
తెలంగాణ గడ్డ నుంచి మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దంగా ఉంది. సికింద్రాబాద్ -నాగ్పూర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాల మధ్య నాలుగు వందే భారత్ రైళ్లు సేవలందిస్తుండగా…ఐదో రైలు ఈ నెల 15 నుంచి పరుగులు పెట్టబోతోందన్నారు. ఈ ఎక్స్ప్రెస్ రైలు రెండు నగరాల మధ్య 578 కిలో మీటర్ల దూరాన్ని కేవలం ఏడు గంటల 15 నిమిషాల్లోనే పూర్తి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. సికింద్రాబాద్ -నాగ్పూర్ స్టేషన్ల మధ్య మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతుంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
TG: ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భట్టి విక్రమార్క. వరద బాధితులను కేంద్రం తప్పకుండా ఆదుకుంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాగానే నిధులు విడుదల చేస్తామన్నారు.