Crime News: దారుణం.. మహిళతో అసభ్యప్రవర్తన.. అడ్డుకున్న విదేశీ టూరిస్టులపై దాడి!
కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కొప్పళ జిల్లా గంగావతిలో ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన పర్యాటకులపై దుండగులు దాడి చేసి తుంగభద్ర ఎడమ కాలువలోకి తోసేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు టూరిస్టులు ఈదుకుంటూ ఒడ్డుకు రాగా.. మరొకరు గల్లంతయ్యారు.
శ్రీ వారి సేవలో కర్ణాటక బిజెపి నేత సి.టి.రవి |Karnataka BJP leader C.T. Ravi in TTD |RTV
HMPV Virus: మహారాష్ట్రలో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు
మహారాష్ట్రలో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు అయ్యాయి. నాగ్పుర్లో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. 7, 13 ఏళ్ల చిన్నారులకు పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు.
VIRAL NEWS: పొట్ట చెక్కలయ్యే ఘటన.. ఆలయ హుండీలో నోటు చూసి అంతా షాక్!
ఓ గుడిలో రూ.20 నోటుపై కనిపించిన వింత కోరిక అందరినీ షాక్కి గురిచేసింది. ‘మా అత్త త్వరగా చనిపోవాలి’ అని రాసి ఉన్న నోటును చూసి అంతా అవక్కయ్యారు. అత్త చావును కోరుకుంటోంది అల్లుడా, కోడలా అని చర్చించుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగి జిల్లాలో చోటుచేసుకుంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో స్కామ్ | EVM Hacking In Maharashtra Election | PM Modi | Rahul Gandhi | RTV
Karnataka: షాకింగ్ న్యూస్.. ఆలయంలో భారీ తొక్కిసలాట.. వేల సంఖ్యలో...!
కర్ణాటకలోని చిక్మంగుళూరులో మాణిక్య ధార కొండపై ఉన్న దేవిరమ్మ జాతరకు వేలాది మందికి పైగా భక్తులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగి వందలమందికి పైగా కొండ మీద నుంచి జారి పడ్డారు. క్షతగాత్రులను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Karnataka: కర్ణాటకలో విరిగిపడిన కొండచరియలు.. నలుగురి మృతి
ఉత్తర కన్నడ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. అంకోలా తాలూకా శిరూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారి 66పై ఈ ఘటన జరిగింది. టీ స్టాల్పై మట్టి దిబ్బలు కూలిపోయాయి. దాన్ని నిర్వహిస్తున్న కుటుంబ సభ్యుల్లో నలుగురి మృతి చెందారు. మరో ముగ్గురి ఆచూకీ లభించాల్సి ఉంది.
PM Modi: పెళ్లి పత్రికల్లో మోదీ పేరు.. చిక్కుల్లో వరుడు
కర్ణాటకలోని ఓ యువకుడు తన పెళ్లి పత్రికలో.. ప్రధాని మోదీని మరోసారి గెలిపించడమే మా జంటకు మీరు ఇచ్చే గొప్ప బహుమతి అని రాయించుకున్నాడు. దీంతో అతడి బంధువొకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.