నేను వస్తున్నా.. ఒక్కొక్కడికి చుక్కలే | KCR To Kaleshwaram Commission Inquiry | RTV
కాళేశ్వరం విచారణకు హాజరుకానున్న కేసీఆర్ కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు BRK భవన్కు దండులా తరలిరావాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. ఓపెన్ కోర్టులో ఈటలను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కేవలం 20 నిమిషాల్లోనే ఈ విచారణ ముగిసింది. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఆర్థికమంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.
తాను హరీశ్ రావుని కలిశాని వస్తున్న వార్తలను MP ఈటల రాజేందర్ ఖండించారు. చావులు, పెళ్లిళ్ల దగ్గర మాత్రమే హరీశ్ రావుని కలిశానని ఆయన అన్నారు. BJPయే తెలంగాణకు దిక్సూచి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన 3 తరాల ఉద్యమంలో అమరులను స్మరించుకున్నారు.
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదంతా ఎన్డీఏ ఆడుతున్న నాటకమని ఆయన ఆరోపించారు.
కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు సోమవారంతో ముగియనున్నాయి. ఈరోజు చివరిరోజు కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ముకేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.
NDSA కాళేశ్వరంపై ఇచ్చిన నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వారే డిజైన్ చేశారు.. వారే కట్టారు.. వారు అధికారంలో ఉండగానే కూలిందని ఆ పార్టీపై ఆయన మండిపడ్డారు. ప్రాజక్ట్ నిర్మించినవాళ్లు రైతులకు ద్రోహం చేశారన్నారు.
మేడిగడ్డ బ్యారేజీలో ప్లానింగ్ నుంచి నిర్వహణ వరకు లోపాలు ఉన్నట్లుగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) గుర్తించింది. మేడిగడ్డ బ్యారేజ్ లోని ఏడో బ్లాక్ కూల్చాల్సిందేనని ఇప్పటికే సిఫార్సు చేసిన ఎన్డీఎస్ఏ మళ్లీ నిర్మించాలని సూచించింది.