J&K TerrorAttack: పహల్గాం ఉగ్రదాడి.. ఇద్దరు ఏపీ వాసులు మృతి !
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ గా అధికారులు గుర్తించారు.
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ గా అధికారులు గుర్తించారు.
జమ్మూ కాశ్మీర్లో పర్యటకులపై ఫైరింగ్ ముందు టెర్రరిస్టులు వారితో మాట్లాడారు. పేరు, మతం అడిగి మహిళ కళ్లముందే ఆమె భర్తని చంపారు. అయితే ఆమెని కూడా చంపమని టెర్రరిస్ట్ను అడిగింది. జరిగింది మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలని ఉగ్రవాది అన్నట్లు తెలుస్తోంది.
జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్ లో 27మంది మృతి చెందారు. మరో 20మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. సాధారణ పౌరులపై ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం. చాలా ఏళ్ల తర్వాత దేశంలో ఇదే భారీ ఉగ్రదాడి కూడా.
అప్పుడే పెళ్లైన జంట హనీమూన్ కోసమని జమ్మూ కాశ్మీర్ కు వచ్చారు. కానీ అదే వారిని వీడదీస్తుందని అనుకోలేదు. కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా ఉగ్రవాదులు ఆమె భర్తను పాయింట్ బ్లాక్ లో కాల్చారు. కళ్లముందే భర్త చనిపోవడం చూసిన ఆమె అక్కడే కుప్పకూలిపోయింది.