Kejriwal: కేజ్రీవాల్ తో భార్య ములాఖత్ రద్దు!
మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితునిగా పేర్కొంటూ తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిసేందుకు ఆయన భార్య సునీతకు అధికారులు అనుమతి ఇవ్వలేదు.
మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితునిగా పేర్కొంటూ తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిసేందుకు ఆయన భార్య సునీతకు అధికారులు అనుమతి ఇవ్వలేదు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై సినీ నటి జయప్రదపై యూపీ లోని రాంపూర్ లో కేసులు నమోదు అయ్యాయి. వీటిపై రాంపూర్ కోర్టు నోటీసులకు ఆమె స్పందించలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది కోర్టు. ఈ క్రమంలో రాంపూర్ కోర్టులో ఆమె లొంగిపోయారు.
గత ఐదేళ్లలో దేశంలో 275 కస్టడీ రేప్ కేసులు నమోదయ్యాయి. 2017 నుంచి మహిళలపై జరిగిన 275 కస్టోడియల్ రేప్ కేసుల్లో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 92 కేసులు నమోదుకాగా.. మధ్యప్రదేశ్లో 43 కేసులు నమోదయ్యాయి.
సూశాంత్ సింగ్ సూసైడ్ కేసులో జైలుకు వెళ్లిన రియా చక్రవర్తి అక్కడి అనుభవాలను షేర్ చేసుకుంది. 'జైలులో రోటీ, క్యాప్సికం కూర పెట్టేవాళ్లు. పేరుకే అది కూర గానీ నీళ్లలా ఉండేది. అయినా బాగా ఆకలిగా ఉండటంతో తినేసేదాణ్ని. నేను పడుకునే పక్కనే టాయిలెట్ ఉండేది' అంటూ చెప్పుకొచ్చింది.
యూపీ ప్రభుత్వం రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను చేసింది. జనవరి 22న జరగబోయే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని జైళ్లశాఖ మంత్రి ధర్మవీర్ ప్రజాపతి తెలియజేశారు.
బిగ్ బాస్ విజేత రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ రోజు సాయంత్రం చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు. నిన్న నాంపల్లి కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
నిన్న న్యాయం ఆలస్యం కావొచ్చు కానీ అంతిమంగా గెలుస్తుంది అంటూ ఓ లేఖ బయటకు వచ్చింది. చంద్రబాబే ఈ లేఖను రాసినట్టు చెప్పారు. కానీ ఇవాళ మళ్ళీ ఆ లేఖను బాబు రాయలేదని...అది ఎవరో సృష్టించిందని అధికారికంగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్ర ఉత్కంఠత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈరోజు కీలకం కానుంది. విజయవాడ హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో కూడా ఈరోజు తీర్పులు వెలువడనున్నాయి. దీంతో చంద్రబాబకు బెయిల్ వస్తుందా? లేదా అన్న ఉత్కంఠతకు నేటితో తెరపడనుంది.
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈరోజు రామండ్రికి వెళ్ళనున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న లోకేష్ ఈరోజు ఉదయం 9 గంటలకు రోడ్డు మార్గంలో లోకేష్ రాజమండ్రి బయలుదేరనున్నారు. సాయంత్రం జైలులో చంద్రబాబుతో అతను ములాకత్ కానున్నారు.