Jeevan Reddy : కాంగ్రెస్‌ కార్యకర్తలకు, వలస వాదులకు మధ్య పోటీ..జీవన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో మాజీమంత్రి జీవన్‌ రెడ్డికి, తాజా ఎమ్మెల్యే సంజయ్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ముదురుతుంది. ఈ రోజు ఆయన మాట్టాడుతూ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్‌ కార్యకర్తలకు, వలస వాదులకు జరుగుతున్న ఎన్నికలన్నారు.

New Update
Jeevan Reddy Vs MLA Sanjay Kumar

Jeevan Reddy Vs MLA Sanjay Kumar

Jeevan Reddy : త్యాల జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న జగిరాజకీయ పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయో కానీ, తగ్గడం లేదు. మాజీమంత్రి జీవన్‌ రెడ్డికి, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం రోజుకు రోజుకు ముదురుతుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో తన వర్గానికి తక్కువ సీట్లు ఇచ్చారని ఆరోపించిన జీవన్‌ రెడ్డి సంజయ్‌కు వ్యతిరేకంగా పలుసార్లు ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. కాగా ఈ రోజు ఎన్నికల సందర్భంగా  జగిత్యాల బాలుర జూనియర్‌ కళశాలలో  కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్‌ కార్యకర్తలకు, వలస వాదులకు జరుగుతున్న ఎన్నికలని ఘాటుగా వ్యాఖ్యానించారు.ఈ ఎన్నికలు కాంగ్రెస్‌ కార్యకర్తల  ఆత్మాభిమానం , ఆత్మగౌరవంగా పరిగణిస్తానని..  మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టి. జీవన్‌రెడ్డి అన్నారు.. కాంగ్రెస్‌లో ఇంటి పోరు కారణంగా ఆయన గత కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికి ఓటు వేసి తన బాధ్యతను నిర్వర్తించారు.

మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లలో 414 వార్డు డివిజన్లకు..116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది.. మొత్తం పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి.. రాష్ట్ర వ్యాప్తంగా 12,930 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం.. 8,203 పోలింగ్‌ కేంద్రాలను రెడీ చేసింది. మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి 52 లక్షలకు పైగా ఓటర్లు ఓటు వేయనున్నారు. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టగా..ఈనెల 16వ తేదీన మేయర్, ఛైర్‌పర్సన్ల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఈనెల 16వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు