Ind vs Pak ODI Match: టీమిండియాను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ..
ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2023 ట్రోఫీలో భాగంగా శనివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా గెలుపొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. టీమిండియా ప్లేయర్లను అభినందించారు. ఇదే అంశంపై ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన.. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన టీమ్ ఇండియాకు అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు.