Operation Shield | రాత్రికి మళ్లీ యుద్ధం? | India Pak War Tension | PM Modi | India Attack Pak | RTV
పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఆ ఆంక్షలు ఇండియా జూన్ 23 వరకు పొడిగించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ ఎయిర్లైన్స్ ఇండియా గగనతలంలోకి రాకుండా ఏప్రిల్ 30న నిషేధించింది.
ఆపరేషన్ సిందూర్ గురించి పాకిస్తాన్కు లీక్ చేసిన ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గురుదాస్పూర్కు చెందిన సుఖ్ప్రీత్ సింగ్, కరణ్బీర్ సింగ్లు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్లో ఆర్మీ కదలికలు, ప్లాన్లు పాక్ నిఘా సంస్థకు అందించారు.
ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్ని అన్ని విధాల దెబ్బ కొట్టింది. పాకిస్తాన్లో ఆశ్రయం పొందిన టెర్రర్ సంస్థలను భారత్ అనుకుంటే నాశనం చేయగలదని ఇండియన్ ఎయర్ ఫోర్స్ నిరూపించింది. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు. భారత్ వ్యూహాత్మక విధానం.
పహల్గాం దాడుల తర్వాత వాటర్, దౌత్యదాడులతో పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచిన భారత్ మరోసారి దాన్నే అనుచరిస్తోంది. ఈరోజు ఉదయం జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై ఉన్నసలాల్ ఆనకట్ట 5గేట్లను భారత అధికారులు తెరిచారు. దీంతో పాక్ లో నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది.
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది. ఎన్నో ఆపరేషన్లకు ఈ నిఘా సంస్థ కీలక పాత్ర పోషించింది. ఇది శాటిలైట్, ఇంటర్నెట్ నిఘా వంటి అధునాతన సాంకేతిక నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
పాకిస్తాన్ గురువారం రాత్రి ఇండియాలో 15 ప్రాంతాలపై దాడులు చేయాలని ప్రయత్నించింది. పాక్ క్షిపణులు, డ్రోన్లను ఇండియా ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎఎస్ గ్రిడ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అడ్డుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా ప్రకటించింది.
1999లో ఇండియా విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన సూత్రదారి జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్. ఇతను కూడా ఆపరేషన్ సిందూర్లో చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.