/rtv/media/media_files/2025/05/08/VdNu0ZsvS6BlLAb38vJW.jpg)
Abdul Rauf Azhar
ఆపరేషన్ సిందూర్లో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలో కీలక వ్యక్తులు చనిపోయినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని బహవల్పూర్, మురిద్కేలపై మంగళవారం రాత్రి భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. 1999లో ఇండియా విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దానికి ప్రధాన సూత్రదారి జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్. ఇతను కూడా ఆపరేషన్ సిందూర్లో చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.
Big news : It is confirmed that Abdul Rauf Azhar was killed in #OperationSindoor.
— Mr Sinha (@MrSinha_) May 8, 2025
He's the brother of Masood Azhar and was mastermind of Kandhar IC-814 (Indian) hijack & many other terrorist attacks in India. pic.twitter.com/UgFu7vrvjT
అబ్దుల్ రవూఫ్ అజార్ జైష్ -ఎ -మొహమ్మద్ ఆపరేషనల్ హెడ్, 1999లో ఇండియాలో అరెస్ట్ అయిన అతని అన్నను విడిపించుకోడానికి IC-814 విమానాన్ని హైజాకింగ్ చేశాడు. అబ్దుల్ రవూఫ్ అజార్ ఇంటర్నేషనల్ జిహాదీ నెట్వర్క్లలో మాస్టర్ మైండ్.
ఆపరేషన్ సిందూర్లో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 చనిపోయారు. వారిలో అతని సోదరి, బావమరిది కూడా ఉన్నారని నిన్న వర్గాలు తెలిపాయి. జైషే ఉగ్రవాది వారిని హతమార్చినట్లు ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశాడు.
(india operation sindoor | indian army operation sindoor | india launches operation sindoor | Indian army-air force operation sindoor | Operation Sindoor Attack | flight hijack | Abdul Rauf Azhar)