TV9 లోగో రవి ప్రకాష్దే.. ! Delhi High Court Shocking Judgment On Logo Issues Notices To ABCL | RTV
మేడిగడ్డ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావులను విచారించాలని రాజలింగమూర్తి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు...అతను చనిపోవడం వలన ఆ పిటిషన్ కు అర్హత లేదని అంది.
2010లో సంచలనం సృష్టించిన వార్ధా సామూహిక అత్యాచారం కేసులో ఈరోజు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇందులో పదేళ్ళుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించింది. జీవో 99కు విరుద్ధంగా వెళితే...దానిని రద్దు చేసి హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించింది.
వివాహేతర సంబంధాల కేసులపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య మరొక పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకోకుండా ప్రేమించడం అక్రమ సంబంధం కిందకి రాదని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి వేసిన పిటిషన్పై న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ముంబై ట్విన్ టన్నెల్స్ ప్రాజెక్టు విషయంలో మేఘా ఇన్ఫ్రాస్టక్చర్ మోసానికి పాల్పడింది అంటూ ముంబై హైకోర్టులో పిల్ దాఖలు అయింది. దీనిపై సీబీఐ లేదా సిట్ దర్యాప్తును వేయాలని కోరుతూ హైదరాబాద్ కు చెందిన జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్ దాఖలు చేశారు.
మహా కుంభమేళాకు గత వారం రోజులుగా భక్తుల తాకిడి ఎక్కువ కాగా.. ఆ ఎఫెక్ట్ హైకోర్టుపై పడింది. ముఖ్యంగా అలహాబాద్ హైకోర్టులోని కేసులన్నీ పెండింగ్లో పడేలా చేసింది. గత రెండు రోజుల నుంచి యూపీలో 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిన సంగతి తెలిసిందే.
దేశంలో విడాకుల కేసులు పెరుగుతున్నాయని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ చెప్పారు. చాలామంది డివోర్స్ పిటిషన్లతోనే కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 600 కుటుంబాల్లో కేవలం 4 ఫ్యామిలీల్లోనే డివోర్స్ కేసులు లేవన్నారు.