Hyderabad : రెండో రోజు కొనసాగుతున్న గణనాథుని నిమజ్జనాలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546 విగ్రహాలు నిమజ్జనం అయినట్లు సమాచారం.