Rohit Sharma vs Gautam Gambhir | రోహిత్ కోహ్లీ ఔట్! | Virat Kohli | INDIA vs Australia | RTV
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు పేలవ ప్రదర్శనపై కోచ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డ్రెస్సింగ్ రూమ్లో పంత్తో పాటు సీనియర్లపై కూడా ఇక చాలంటూ తీవ్ర అసహనం చూపించారని టాక్ వినిపిస్తోంది. ఇదే రిపీట్ అయితే వేటు తప్పదంటూ హెచ్చరించారట.
ఆస్ట్రేలియా టూర్ లో భారత్ విఫలమైతే గంభీర్ ను హెడ్ కోచ్ పదవినుంచి బీసీసీఐ తప్పించబోతుందనే వార్తలను మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఖండించారు. ‘ఇదంతా తప్పుడు ప్రచారం. గంభీర్ ఇప్పుడే బాధ్యతలు చేపట్టాడు. ఆటగాళ్లు ఆడకపోతే కోచ్ తొలగించడం జరగనిపని‘ అన్నారు.
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ పేలవమైన ఆటపై మాజీలు మండిపడుతున్నారు. ఒక రోజులో 400 పరుగులు చేయగల జట్టుగా తీర్చిదిద్దాలనే గంభీర్ ఆలోచన మంచిది కాదంటున్నారు. పూజారాలాంటి ఆటగాడు ఉండాలని చెబుతున్నారు.
బంగ్లాదేశ్ తో టీ20 సెంచరీపై భారత బ్యాటర్ సంజూ శాంసన్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ బయటపెట్టాడు. 47 బంతుల్లోనే 111 పరుగులు చేసిన సంజూ.. మేనేజ్మెంట్ సపోర్ట్తోనే ఇది సాధ్యమైందన్నాడు. సూర్య, గంభీర్, అభిషేక్ ముందే ఓపెనర్ గా ప్రిపేర్ కావాలని చెప్పారన్నాడు.
శ్రీలంక టూర్లో నేటినుంచి కోచ్గా జర్నీ మొదలుపెట్టనున్న గౌతమ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రావిడ్ సర్ప్రైజ్ మెసేజ్ ఇచ్చాడు. 'నీవు ఒంటరి కాదు. మేమంతా నీతోనే ఉంటాం. అప్పుడప్పుడు నవ్వుతూ కనిపించు' అంటూ వాయిస్ మెసేజ్ పంపాడు. అది విన్న గంభీర్ ఎమోషనల్ అయ్యాడు. వీడియో వైరల్ అవుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలంటే హార్దిక్ పాండ్యా ముందు దేశవాళీ టోర్నమెంట్ లో తన సత్తా నిరూపించుకోవాల్సి ఉంటుంది. విజయ్ హజారే టోర్నీలో ఆడి, తన ఫిట్ నెస్ నిరూపించుకోవాలని కోచ్ గంభీర్ కోరినట్టు బీసీసీఐ వర్గాల సమాచారం. అంటే, ఆ టోర్నీలో ప్రతిభ కనబరిస్తేనే పాండ్యా ఎంపిక ఉంటుంది
IPLలో కోహ్లీ,గంభీర్ వివాదంపై తాజాగా లక్నోప్లేయర్ అమిత్ మిశ్రా స్పందించాడు. కోహ్లీ హద్దులు దాటి లక్నో ఆటగాడు నవీన్ ఉల్ హక్ను తిట్టాడని, ఆ తర్వాత గంభీర్ ఆవేశపడ్డాడని మిశ్రా వెల్లడించాడు. ఒకానొక సమయంలో గంభీర్ని ఒంటరిగా వదిలేయమని హెచ్చరించాడని మిశ్రా తెలిపాడు.
టీమ్ఇండియా హెడ్ కోచ్గా గౌతమ్గంభీర్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా అధికారికంగా ప్రకటించారు. మిస్టర్కు స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉందంటూ పోస్ట్ పెట్టారు. జులై 27 నుంచి శ్రీలంకతో జరగనున్న 3 టీ20ల సిరీస్ తో గంభీర్ ప్రయాణం మొదలుకానుంది.