Encounter: దద్దరిల్లిన దండకారణ్యం.. మావోల కాల్పుల్లో సైనికులు మృతి
భారత భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులతో దండకారణ్యం దద్దరిల్లింది. మంగళవారం సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని టేకులగూడెం గ్రామం వద్ద భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా ఎదురుపడిన మావోలు బలగాలపై కాల్పులు జరిపారు. 14 మంది గాయపడగా ముగ్గురు సైనికులు చనిపోయారు.