కేటీఆర్ ను టచ్ చేస్తే... ! | Guvvala Balaraju Reacts On ED Investigation On KTR | RTV
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో రేపు విచారణకు హాజరుకాలేనంటూ కేటీఆర్ 'ఈడీ'కి విజ్ఞప్తి చేశాడు. కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో సమయం కావాలని కోరారు. దీంతో కేటీఆర్ రిక్వెస్టుకు ఈడీ అమోదం తెలిపింది. తదుపరి విచారణ తేదీని వెల్లడిస్తామని ఈడీ స్పష్టం చేసింది.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 7న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది ఈడీ.
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డిసెంబర్ 30వరకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఫెమా చట్టం కింద ఈడీ కేటీఆర్ను అరెస్ట్ చేసి ఐదేళ్ల జైలు శిక్ష, 3 రెట్ల జరిమానా విధించనున్నట్లు తెలుస్తోంది. నోటీసులు కూడా సిద్ధమైనట్లు సమాచారం.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనిపై రంగంలోకి దిగిన ఈడీ.. కేటీఆర్పై మరో కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది.
కేటీఆర్ పై నమోదైన ఫార్ములా-ఈ కేసులోకి ఈడీ ఎంటరైంది. తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. ఎంత మొత్తం బదిలీ చేశారనే అంశంపై వివరాలు ఇవ్వాలని కోరింది.
భూదాన్ భూముల స్కామ్లో నాగర్ కర్నూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇతనితో పాటు సుబ్బారెడ్డి, సూర్య తేజ, సిద్దారెడ్డికి కూడా నోటీసులు పంపింది. డిసెంబర్ 16న విచారణకు హాజరు కావాలని తెలిపింది.
TG: రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల అక్రమ బదలాయింపు కేసులో ఐఏఎస్ అమోయ్కుమార్కు ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసు సంబంధించిన ఆధారాలను డీజీపీకి ఇచ్చారు. అమోయ్కుమార్పై కేసు నమోదు చేయాలని సిఫార్సు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తునకు యోచనలో ఈడీ ఉంది.
ఈడీ, ఐటీ దాడులకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్పందించారు. 'బీజేపీ, బీఆర్ఎస్ మంచి దోస్త్. మా ఇంట్లో జరిగిన రెయిడ్స్ కు సంబంధించిన డేటా కావాలంటే బీజేపీని అడిగి బీఆర్ఎస్ రిలీజ్ చేసుకోవచ్చు' అంటై సెటైర్స్ వేశారు.