Nitish Father Emotional Words | గోదావరిలో 8 మంది గ*ల్లంతు | Godavari River Tra*gedy Mammidivaram
తూర్పు గోదావరిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు.ఈ ఘటన ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద చోటుచేసుకుంది. పెళ్లి కోసమని వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు.
నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. ప్రతిపక్షంలో ఉండగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేశారంటూ శ్రీరెడ్డిపై టీడీపీ మహిళ నేతలు కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు.
ఏపీలోవాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు పందిరి వెంకటనారాయణను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన నగలను ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఫార్మసిస్ట్ విద్యార్థిని నాగాంజలి అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాగాంజలి మృతికి కారణమైన దీపక్ను...కఠినంగా శిక్షించాలని బంధువులు,గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని నిరసనకు దిగారు.
లైగింక వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మాసిస్ట్ నాగాంజలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.దీపక్ అనే వ్యక్తి వేధించడం వల్లే తాను చనిపోతున్నట్లు నాగాంజలి సూసైడ్ నోట్ రాసింది.
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భోజనం చేస్తుండగానే ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. వెనక నుంచి దాడి చేసి కత్తులతో అతని గొంతుకోశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని సరిగా చూసుకోవడం లేదని సొంతమామ, బావమరిదే ఈ దారుణానికి ఒడిగట్టారు.