Dharani Portal: ధరణి స్కామ్.. రూ. 60వేల కోట్ల ప్రభుత్వ భూములు స్వాహా!
ధరణి పోర్టల్ ద్వారా కొంత మంది అధికారులు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో సుమారు రూ.60 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపించింది. దీనిపై విచారణ జరపాలని సీఎం రేవంత్ కు లేఖ రాశారు.