YS Sharmila: కేసీఆర్ పాలనను బొంద పెట్టాలె.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!
సీఎం కేసీఆర్ పై షర్మిల మరోసారి విమర్శల దాడికి దిగారు. స్వయానా ముఖ్యమంత్రికి గుంట భూమి ఎక్కువొచ్చిందంటే ఇక సామాన్యుల సంగతి దేవుడెరుగు అని అన్నారు. ఉన్నోళ్లకు లేనట్టుగా, లేనోళ్లకు ఉన్నట్టుగా, సర్వే నెంబర్ల దాకా మార్చి చూపించే మాయాజాలమే ధరణి అని ఎద్దేవా చేశారు.