దక్షిణాదిపై మోదీ వివక్ష.. ! | Loss Of Parliamentary Seats | Delimitation Dispute Explained | RTV
త్రిభాషా విధానం వల్ల మాతృభాషలకు అన్యాయం జరగదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మతృభాషల బలోపేతానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. హిందీని బలవంతంగా రుద్దుతారని నేను అనుకోవడం లేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం డీలిమిటేషన్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దక్షిణాది రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి. ఎందుకు దీన్ని దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకిస్తున్నాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
డీలిమిటేషన్పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవడం కోసమే నియోజకవర్గాల పునర్విభజన చేపడుతోందని విమర్శలు చేశారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు.
సీఎం స్టాలిన్ ఏడు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ విధానానికి వ్యతిరేకంగా ''జాయింట్ యాక్షన్ కమిటీ'' ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. మార్చి 22న చెన్నైలో జరగనున్న జేఏసీ సమావేశానికి హాజరుకావాలని కోరారు.
దంపతులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని గతంలో పిలిపునిచ్చిన సీఎం స్టాలిన్.. తాజాగా మరోసారి స్పందించారు. డీలిమిటేషన్ వల్ల నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లయిన జంటలు త్వరగా పిల్లలు కనాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని భావిస్తే.. ఆయా రాష్ట్రాలు అందిస్తున్న ఆర్థిక భాగస్వామ్యానికి తగ్గట్టు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో దేశ జనాభాలో 2.8 శాతం ఉండి.. జీడీపీకి 5.2 శాతం భాగస్వామ్యం అందిస్తోందన్నారు.
2025లో జనగణన, 2028 నాటికి లోక్సభ పునర్విభజన ప్రక్రియ ముగుస్తుందని పలు సంబంధిత వర్గాలు చెప్పిన సంగతి తెలిసిందే. డిలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
కొత్తగా పెళ్లయిన జంటలు 16 మంది పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లోక్సభ నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉన్నందున తక్కువ మంది పిల్లల్ని కనడానికి ఎందుకు పరిమితం కావాలని.. 16 మందిని ఎందుకు కనకూడదంటూ వ్యాఖ్యానించారు.