రుషికొండ ప్యాలెస్ కు సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదే..! | CM Chandrababu Naidu To Visit Rushikonda
AP: మద్యం షాపుల్లో ఎవరైనా MRP ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. ఒకవేళ రుజువైతే మొదటి సారి అయితే రూ.5 లక్షలు ఫైన్, తరువాత కూడా తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దు చేయాలని అన్నారు.
AP: రాష్ట్ర మంత్రి వర్గం మరోసారి భేటీ కానుంది. వచ్చే నెల 6న సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఈ భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే పలు అంశాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
ఏపీకి ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్తో హడ్కో ఛైర్మన్ సచివాలయంలో భేటీ అయ్యారు.
సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించి వైసీపీ. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి, అందులో రాజకీయంగా బావమరిది హరికృష్ణ సహా బంధువులను వాడుకున్న మాట నిజం కాదా? అని నిలదీసింది. హరికృష్ణకి మంత్రిపదవి ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నది నిజం కదా? అని ప్రశ్నించింది.
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ట్విట్ల యుద్ధం జరుగుతోంది. నిన్న ఆస్తులపై జగన్కు షర్మిల రాసిన లేఖను టీడీపీ బయటపెట్టగ.. తాజాగా టీడీపీపై వైసీపీ మరో సంచలన ట్వీట్ చేసింది. డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? అంటూ సాక్షాలతో బయటపెట్టింది.